Skip to content

గౌరీ పరమేశ్వరుల పూజా విదానం – శరగడం రామ సింహాచలం నాయ్ఢు

  • by
మన  గౌరీ  పుత్రులకి  నమస్కారం , మన  గవర  కులస్థులు   గౌరీ దేవి  అంశతో జన్మించారని ,అందువలన  గౌరీయులు  అంటారని  మన  పెద్దలు  చెబుతుంటారు .  మన గవర పుత్రులు  ఎక్కడ ఉన్నా గౌరీ  పరమేశ్వరుల  పూజ  చేయడం ఆనవాయితి . పూజా  విదానం వారి నివసించే  ప్రదేశాలను బట్టి మారుతుంది . దీపావళి  అమావాస్య  ముందు  వచ్చే  పౌర్ణమిని  గౌరీపౌర్ణమి  అంటారు .  గౌరీ  పౌర్ణమి  నాడు  మన  కుల  పెద్దలు  ఎంపిక చేసిన ( బాగుగా  పండిన ) వరి  పొలంలో ఒక  దుబ్బుని  తీసి  కుండిలో  పెట్టి , నవధాన్యాలు  వేసి  మట్టితో  నింపుతారు . దుబ్బు  తీసిన  చోట  పైకం  ముంచుతారు . ఈ  తతంగమంతా  ముతైధువలు  సమక్షంలో  ముతైధువలే  నిర్వహిస్తారు . ఈ  వ్యవహారమంతా  ఒక  నదీతీర ప్రాంతములోనో లేదా  వరి  చేనుకు  దగ్గర  గల  బావి  చెంతనో  జరుగుతుంది . పూజా  విధానం  పూరైన  పిమ్మట  మన  గౌరీ  ముతైధువులు  గాని  పది  సంవత్సరాలు  నిండని  గౌరీ  పుత్రికలు  గాని  నెత్తి  మేద  పెట్టుకొని  పురవీదులలో  భాజా భజంత్రీల మధ్య  ఊరేగింపుగా   తీసుకొని వచ్చి  పూజా  మండపంలో  దిష్టితీసి ,  హరతిచ్చి  మరి  కూర్చోబెడతారు . ఈ  పూజా  విదానమంతా  మన గౌరీ  పెద్దల  సమక్షంలో  గౌరీ  బాలికల  చేత  చేయించడం  జరుగుతుంది . తరువాత  వారం , పది  రోజులలోపు అమ్మవారిని  తీసుకువచ్చి  పూజ  ప్రారంభమవుతుంది . అమ్మ వారి  విగ్రహం  కోసం  ప్రత్యేకమైన  పీట  తయారుచేయిస్తారు . పీట మేద  విగ్రహం తయారుచేయిస్తారు . శిల్పి కి  అమ్మవారిని  తీసుకొచ్చేటప్పుడు స్వయంపాకం  ( బియ్యం , పప్పు , చింతపండు , అరటికాయ ,తోటకూర , ఎండు మిరపకాయలు , చిమ దుంప , పెండ్లం , వంకాయ , గుమ్మడి ముక్క ,  వగైరాలు ) రొక్కం  ఇవ్వడం  ఆనవాయితి .అమ్మవారిని  నెత్తి  మేద  పెట్టుకొని  ఊరేగిస్తూ మండపంలో  నిల్పుతారు . కొన్ని  ప్రదేశాలలో  జగమయ్య  పూజ  చేస్తారు . సాయంత్రం  గొబ్బీలుపాట  పాడతారు ., రాత్రి పూట  చిడతాలు  ఆడతారు . సంధర్బాన్ని  బట్టి  సారె  మహోత్సవం , అన్నధాన కార్యక్రమం ,  కుంకుమ  పూజలు ,  ప్రత్యేక  దీపారాధనలు ,వివిధ  సాంస్క్రతిక  కార్యక్రమాలు నిర్వహించడం  జరుగుతుంది . సమయాన్ని  బట్టి  అనుపు  మహోత్సవం  నిర్వహిస్తారు . ఈ  పూజా  విధానం  జరుగుచున్న  రోజులు  ఒంటి పూట  శాకాహరం ,టిఫిన్ ( కొన్ని  చోట్ల  ఉల్లిపాయ కలపకుండా )  వారే  స్వయంగా  వండుకొని , భోజనం  చేస్తారు . మొత్తం  కార్యక్రమం  అయిన  తరువాత  అప్పటివరకు  ఆస్థానంలో  ఉన్న  పూజారమ్మని  ముస్తాబు  చేసి  ఇంటికి  పంపండంతో  గౌరీ  పూజ  పూర్తి  అవుతుంది .  మన  గౌరీ  సాంప్రదాయాలు  కనుమరుగై , కాల గర్బంలో  కలిసిపోతున్న  ఈ  రోజులలో   ,నేటి  తరానికి  తెలియ జేసే  చిన్న  ప్రయత్నం  ఈ  చిన్న  వ్యాసం .  ప్రదేశాలని  బట్టి  మార్పులు ,చేర్పులు  ఉంటాయి . మన  ఆచార , వ్యవహారాలు  మన  తరువాతి  తరానికి  తెలియజేద్దాం . మన  సంస్క్రతి  సాంప్రదాయాలను  కాపాడుదాం…..

శరగడం  రామ  సింహాచలం  నాయ్ఢు , కటక్  (ఒడిస్సా )

Related Images:

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest

0 Comments
Inline Feedbacks
View all comments
0
Would love your thoughts, please comment.x
()
x